Wednesday, May 15, 2024

తల్లికి తలకొరివి పెట్టిన కూతురు

- Advertisement -
- Advertisement -

కారేపల్లి : నవ మాసాలు మోసి కని పెంచిన తల్లికి తలకొరివి పెట్టి, తన తల్లి రుణాన్ని తీర్చుకుంది ఓ కూతురు. మండల పరిధిలోని శాంతి నగర్ గ్రామానికి చెందిన ఇప్ప కౌసల్య (65) బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందింది. మృతు రాలికి కొడుకులు లేరు. ఇద్దరు ఆడబిడ్డలే కావడంతో చిన్న కూతురు ఇప్ప సుధ తన తల్లికి హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియల్లో పాల్గొని, తలకొరివి పెట్టి కన్నతల్లి రుణాన్ని తీర్చుకుంది. కన్నతల్లికి కూతురు తలకొరివి పెడుతున్న దృశ్యం అక్కడికి వచ్చిన బంధు మిత్రులందరికీ కంటతడి పెట్టించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News