Friday, April 26, 2024

కరోనా వైరస్ సోకి ఎసిపి మృతి..

- Advertisement -
- Advertisement -

 

లుథియానా: పంజాబ్‌ రాష్ట్రంలోని లుథియానాలో మహ్మమారి కరోనా వైరస్‌(కోవిడ్-19) ఓ పోలీసు అధికారిని బలి తీసుకుంది. ఏప్రిల్‌ 13న ఎసిపి అనిల్‌ కుమార్‌ కోహ్లీ(52)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వెంటనే సద్గురు ప్రతాప్‌ సింగ్‌ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకడంతోపాటు అతని శరీరంలోని ఇతర భాగాలు  కూడా చెడిపోవడంతో శనివారం చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఎసిపి భార్యకు కూడా కరోనా సోకడంతో ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, పంజాబ్‌లో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 211కు చేరగా.. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14కు చేరింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 14,723 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, 496 మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

ACP Officer Anil Kohli Died due to Covid 19 in Punjab

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News