Monday, May 6, 2024

కామెడీ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

భారతి క్రియేషన్స్, కథెరిన్ ఫిల్మ్ వర్క్స్, మౌనిక ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మిస్తున్న నూతన చిత్రం ‘ఎస్‌కె’ గురువారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రారంభమైంది. చిరంజీవి కుంచల్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహి స్తున్నారు. సర్దార్ సుర్జీత్ సింగ్ నిర్మాత. సీనియర్ నటుడు పృథ్వీ(30 ఇయర్స్ ఇండస్ట్రీ) కుమార్తె శ్రీలు ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం కానుంది. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. హీరో, దర్శకుడు చిరంజీవి కుంచల్ మాట్లాడుతూ “అన్ని కమర్షియల్ హంగులతో కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. నా మొదటి మూవీ ‘జీఎఫ్’ విడుదలకు సిద్ధంగా ఉండగానే మరో సినిమా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది” అని అన్నారు. నిర్మాత సర్దార్ సుర్జీత్ సింగ్ మాట్లాడుతూ “30 రోజులపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. సినిమా ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. పృథ్వీ కీలక పాత్రలో కనిపిస్తారు”అని చెప్పారు. సెజల్, గడ్డం నవీన్, అభిరామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః వలి, మ్యూజిక్ ః శ్రీ వెంకట్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News