Tuesday, May 14, 2024

నాకు ఆ ఫీలింగ్ లేదు

- Advertisement -
- Advertisement -

మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, చిత్రలహరి, అల.. వైకుంఠపురములో చిత్రాల్లో నటించిన టాలెంటెడ్ హీరోయిన్ నివేథా పేతురాజ్. ప్రస్తుతం ఆమె రామ్ సరసన ‘రెడ్’ మూవీలో నటించింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ నివేథా పేతురాజ్‌తో ఇంటర్వూ విశేషాలు…


స్క్రిప్ట్ వినకుండానే…
కిషోర్ తిరుమల ‘చిత్రలహరి’ సినిమా స్టోరీ చెప్పినప్పుడు ఫుల్ స్టోరీ వినకుండానే ఆ సినిమా చేస్తానని చెప్పాను. అదేవిధంగా ఈ సినిమాను కూడా స్క్రిప్ట్ వినకుండానే ఓకే చేశాను.
పోలీస్ క్యారెక్టర్ నాది…
ఈ సినిమాలో నాది పోలీస్ క్యారెక్టర్. కొంచెం అమాయకంగా ఉండే పాత్ర ఇది. పైకి చాలా గంభీరంగా ఉన్నట్టు కనిపిస్తాను కానీ లోపల మాత్రం చాలా అమాయకంగా ఉంటాను.
సొంతంగా డబ్బింగ్ చెప్పా…
హీరో రామ్ వెరీ వెరీ ప్రొఫెషనల్. అతనికి సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. ఇక రామ్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్‌లు చేశాడు. రామ్, కిషోర్ సార్ ఇద్దరూ తమిళ్‌లో మాట్లాడతారు. సెట్‌లో మేము తమిళ్‌లోనే మాట్లాడుకునే వాళ్లం. ఇక నేను తెలుగు నేర్చుకుంటున్నాను. ‘రెడ్’ మూవీలో నేను డబ్బింగ్ చెప్పాను. అది కూడా నాలుగు రోజుల్లోనే చెప్పేశాను.
ఆ ఫీలింగ్ లేదు…
‘చిత్రలహరి’ సినిమాలో నా క్యారెక్టర్‌కి ప్రాధాన్యత ఉంది. ఇక ‘అల.. వైకుంఠపురములో’ చిన్న క్యారెక్టరే చేశాను. కానీ ఈ సినిమాతో ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాను. నాకు ఫస్ట్ హీరోయినా సెకండ్ హీరోయినా అనే ఫీలింగ్ లేదు. క్యారెక్టర్‌కి సెట్ అవుతానని అనుకుంటే నేను చేస్తాను.
నెక్ట్స్ మూవీస్…
నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో సీరియస్ క్యారెక్టర్లు చేసాను. నెక్ట్స్ చేయనున్న ‘పాగల్’ మూవీలో నవ్వుతూ ఉండే క్యారెక్టర్ చేస్తున్నాను. ‘విరాటపర్వం’ సినిమాలో ఫైట్ సీన్స్ చేస్తున్నాను. చందు మొండేటి డైరెక్షన్‌లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇది ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.

Actress Niveda Pethuraj Interview

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News