Monday, May 6, 2024

జూబ్లీహిల్స్‌లో ఇంటిని కబ్జా చేసేందుకు నటి స్వాతి యత్నం?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రముఖులు యత్నించారు. దాదాపు రూ. 30 కోట్ల విలువైన ఇంటిని కబ్జా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించిన వారి పన్నాగం బట్టబయలైంది. ఈ కుట్రలో నటి స్వాతి దీక్షిత్ సహా పలువురు భాగమైనట్లు సమాచారం. ఇంటి లీజు విషయంలో ఎన్‌ఆర్‌ఐతో స్వాతి దీక్షిత్‌కు వివాదం జరిగింది. ఈ క్రమంలో ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారని వాచ్ మెన్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్వాతి దీక్షిత్ సహా 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇంటి లీజు కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News