మిల్కీ బ్యూటీ తమన్నా వరుస సినిమాలతో చాలా బిజీగా వుంది. గోపీచంద్ సరసన చేస్తోన్న ‘సీటీమార్’ ఆమె కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రమట. కబడ్డీ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాని దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తోన్న విషయం విదితమే. కరోనా నేపథ్యంలో ఈ సినిమా ఆలస్యమైంది కానీ ఈపాటికి సినిమా పూర్తయిపోయేదే. ఇదిలాఉండగా మరో అరడజను సినిమాల్లో నటిస్తోన్న తమన్నా త్వరలోనే ఓ ప్రొడక్షన్ హౌస్ని సొంతంగా లాంచ్ చేయనుందని తెలిసింది. హీరోయిన్గా కెరీర్లో ఎన్నో విజయాలు అందుకొని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పాపులారిటీ పెంచుకున్న తమన్నా సినీ పరిశ్రమకు తనవంతుగా ఏదైనా చేయాలన్న ఉద్దేశ్యంతోనే సొంత బ్యానర్ని స్థాపించబోతోందట. ముందుగా ఓ వెబ్సిరీస్ని ఆమె నిర్మించబోతోందనీ, ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందే ఓ సినిమాని తెరకెక్కించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయమై తమన్నా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
Actress Tamannaah will start her own Banner?