ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రాధే శ్యామ్’ షూటింగ్ చివరి దశలో ఉంది. దీని తర్వాత మరో పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ చేయబోతున్నాడు ఈ కథానాయకుడు. ఈ రెండు చిత్రాలు కూడా పూర్తి భిన్నమైనవి కావడంతో పాటు వీటిపై అంతే స్థాయి అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ‘రాధేశ్యామ్’లో లవర్ బాయ్ రోల్లో కనిపించనున్న డార్లింగ్ ఆతర్వాత ‘ఆదిపురుష్’లో పౌరాణిక పాత్రలో కనిపించేందుకు సన్నద్ధమవుతున్నాడు. అందుకే అప్పుడే మేకోవర్ను కూడా మార్చేస్తున్నట్టు తెలిసింది. స్లిమ్గా మారిపోతున్నట్టు తన లేటెస్ట్ ఫోటోలను చూస్తే అర్ధమవుతుంది. మరి ప్రభాస్ నీలిమేఘ శ్యామునిగా ఎలా కనిపిస్తాడో చూడాలి. ఈ చిత్రాన్ని దర్శకుడు ఓంరౌత్ 3డిలో భారీ బడ్జెట్తో తెరకెక్కించబోతున్నాడు. ఇండియన్ స్క్రీన్పై నెవర్ బిఫోర్ విజువల్ ట్రీట్లా దీన్ని రూపొందించబోతున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ఫిల్మ్మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు.