Saturday, April 27, 2024

అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక దినోత్సవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకల్లో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మామిడి తోరణాలు, పూలు, విద్యుత్ దీపాలతో ఆలయాలను అలంకరించడంతోపాటు వేద పారాయాణం, అభిషేకాలు, హోమాలు, హరికథలు, కవి సమ్మేళనం, సత్కారాలు, శాస్త్రీయ సంగీతం, నృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు కొత్తగా 2,043 ఆలయాలకు ధూప, దీప, నైవేధ్య పథకం అమలుకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,645 దేవాలయాలకు ఈ పథకం వర్తిస్తుండగా కొత్త వాటితో కలుపుకొని మొత్తం 6,661 దేవాలయాలకు ఈ పథకం అమలు కానుందన్నారు. అర్చకుల వేతనాలను రూ.6,000 నుంచి రూ.10,000 లకు పెంచుతామని సిఎం కెసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో త్వరలోనే దీనిని కూడా అమలు చేస్తామని మంత్రి తెలిపారు.

నేటి నుంచి భక్తులకు మిల్లెట్ ప్రసాద సేవలు
ఆధ్మాత్మిక దినోత్సవం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నిర్వహించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు మంత్రి వివరించారు. నేటి నుంచి భక్తులకు మిల్లెట్ ప్రసాద సేవలను ప్రారంభిస్తున్నామని మంత్రి వెల్లడించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహా స్వామి వారి బంగారం, వెండి నాణేల అమ్మకం, ఆన్‌లైన్ టికెట్ సేవల ప్రారంభం, రాయగిరి వేదపాఠశాల నిర్మాణానికి భూమిపూజ, అన్నదాన సత్రం ప్రారంభం, ప్రెసిడెన్షియల్ సూట్ సమీపంలో కల్యాణ మండపాన్ని ప్రారంభించనున్నట్టు మంత్రి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News