Monday, May 6, 2024

పాత స్థానాలనుంచే సిఎం, డిప్యూటీ సిఎం పోటీ

- Advertisement -
- Advertisement -

AIADMK released first list of candidates

అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితా విడుదల చేసినఅన్నాడిఎంకె

చెన్నై: తమిళనాడులో ఏప్రిల్ 6 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకుగాను అధికార అన్నాడిఎంకె పార్టీ శుక్రవారం ఆరుగురు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి కె పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి ఒ పన్నీర్ సెల్వంల పేర్లతో పాటుగా మరో నలుగురు సిట్టింగ్ ఎంఎల్‌ఎల పేర్లున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి సేలం జిల్లాలోని తన సొంత నియోజకవర్గం ఎడప్పాడినుంచి మరోసారి పోటీ చేస్తారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా తన స్వస్థలమైన థేని జిల్లాలోని బోడినాయకనూర్‌నుంచి మరోసారి బరిలోకి దిగనున్నారు. వీరు కాక పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డి జయకుమార్ చెన్నైలోని రాయపురంనుంచి పోటీ చేయనుండగా మరో మంత్రి సివి షణ్ముగం ఉత్తర తమిళనాడులోని విల్లుపురంనుంచి పోటీ చేస్తారు. సిటింగ్ ఎంఎల్‌ఎలు ఎస్‌పి షణ్ముగనాథన్, ఎస్ తెన్‌మోళిలు శ్రీవైగుండమ్, నీలకోట్టైనుంచి పోటీ చేస్తారు.

AIADMK released first list of candidates

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News