Thursday, May 9, 2024

వాణిదేవికి అన్ని వర్గాల మద్దతు: వేముల

- Advertisement -
- Advertisement -

All Categories support to Vanidevi

 

హైదరాబాద్: రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎంఎల్‌సి అభ్యర్థి సురభి వాణిదేవికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వేముల మీడియాతో మాట్లాడారు. విద్యారంగంలో వాణిదేవి విశేష సేవలందించారని, ప్రజల కోసం పని చేస్తున్న పార్టీ టిఆర్‌ఎస్ అని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహా రావు కుటుంబాన్ని గౌరవించాలని, అందుకే సురభి వాణిదేవికి సిఎం కెసిఆర్ ఎంఎల్‌సి టికెట్ ఇచ్చారని వేముల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్‌పి చైర్మన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ తీగల కృష్ణారెడ్డి, ఎంఎల్‌సి అభ్యర్థి సురభి వాణిదేవి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News