Saturday, April 27, 2024

మద్యం సేవించి వాహనం నడిపే వారందరూ టెర్రరిస్టులే..!

- Advertisement -
- Advertisement -

 

All those who drive under influence of alcohol are terrorists:Sajjanar

 

మనతెలంగాణ/హైదరాబాద్ : బస్సు డ్రైవర్లు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆర్‌టిసి ఎండి సజ్జనార్ హెచ్చరించారు. అయితే తాజాగా ‘దావత్ వితౌట్ దారు’ అనే నినాదంతో మద్య నిషేధంపై ప్రచారం చేస్తోన్న నగరానికి చెందిన వ్యక్తిని సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ప్రత్యేకంగా అభినందించారు. ఇదే విషయమై ట్విట్టర్ వేదికగా ఆర్‌టిసి ఎండి సజ్జనార్ ఒక పోస్ట్ చేస్తూ, మందుకు బానిసై ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయని, తన దృష్టిలో మద్యం సేవించి వాహనం నడిపే వారందరూ టెర్రరిస్టులేనని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News