Saturday, April 27, 2024

కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి

- Advertisement -
- Advertisement -

Ambedkar photo should be printed on currency note

పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తాలి
టిఆర్‌ఎస్ ఎంపిలకు సూచించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్

హైదరాబాద్ : కరెన్సీ నోటుపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్. అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ కమిటీ ప్రతినిధులు శుక్రవారం మంత్రుల నివాసంలో వినోద్ కుమార్‌తో సమావేశమయ్యారు. తమ డిమాండ్ కు మద్దతు ఇవ్వాలని వినోద్ కుమార్ ను కోరారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలన్న కమిటీ ప్రతినిధుల డిమాండ్ న్యాయ సమ్మతమైనదేనని అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటు వేదికగా లేవనెత్తాలని టిఆర్‌ఎస్ ఎంపిలకు ఆయన సూచించారు. దేశంలో రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ అని, అలాంటి మహానీయున్ని గౌరవించుకోవడం కనీస బాధ్యత అని అన్నారు. కమిటీ చేపట్టిన ఆగస్టు 3,4,5 తేదీలలో ‘ చలో ఢిల్లీ ‘ వాల్ పోస్టర్‌ను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురాం, నాయకులు స్వామి, నర్సింహులు, ఆశీర్వాదం, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News