Monday, April 29, 2024

మళ్లీ ఎయిమ్స్‌లో చేరిన అమిత్‌షా..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరినట్టు ఆస్పత్రివర్గాలు ఆదివారం వెల్లడించాయి. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఒకటి, రెండు రోజులపాటు పూర్తిస్థాయి వైద్య పరీక్షల నిమిత్తం అమిత్‌షా శనివారం రాత్రి 11 గంటలకు ఎయిమ్స్‌లో చేరినట్టు తెలిపారు. ఆగస్టు 2న అమిత్‌షాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన మొదట గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో చికిత్స పొందారు. ఆ హాస్పిటల్ నుంచి ఆగస్టు 14న డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత మరోసారి అనారోగ్యానికి గురై ఆగస్టు 18న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి చికిత్స పొందారు. ఆగస్టు 30న డిశ్చార్జి అయ్యారు. ఇప్పుడు మరోసారి ఎయిమ్స్‌లో చేరారు.

Amit Shah admit in Delhi AIIMS Again

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News