Friday, April 26, 2024

బాగ్దాద్ ఈశాన్య గ్రామంలో ఐఎస్ దాడికి 11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

An IS attack in Baghdad has killed at least 11 people

 

బాగ్దాద్ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపు సాయుధులైన దుండగులు బాగ్దాద్ ఈశాన్య ప్రాంతంలోని ఒక గ్రామంపై మంగళవారం దాడి చేసి 11 మంది పౌరులను బలిగొన్నారు. ఈ దాడిలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని ఇరాక్ భద్రతాధికారులు తెలిపారు. దియాలా ప్రావిన్సు లోని ఈశాన్య ప్రాంతం షియాతీల అల్ రషద్ గ్రామంలో ఈ దాడి జరిగింది. దాడికి దారి తీసిన పరిస్థితులు ఏమిటో తెలియడం లేదు. అయితే ఐఎస్ గ్రూపు ఉగ్రవాదులు అంతకు ముందు ఇద్దరు గ్రామస్థులను కిడ్నాప్ చేశారని, వారిని విడుదల చేయడానికి డిమాండ్ చేసిన డబ్బు చెల్లించక పోవడంతో దాడికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు. ఈ దాడిలో మెషిన్ గన్సు ఉపయోగించినట్టు చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News