Sunday, April 28, 2024

కూకట్ పల్లిలో కరోనా కలకలం..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లి, కెపిహెచ్ బిలో కరోనా కలకలం రేపుతోంది. ధర్మారెడ్డి కాలనీ ఫేజ్ 2లో శనివారం మాధవి అనే 28ఏళ్ల మహిళకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఆమెతోపాటు ఇంట్లో ఉన్న మరో ఇద్దరికి కూడా కరోనా సోకినట్లు అనుమానం రావడంతో ఈరోజు తెల్లవారుజామున అధికారులు ముగ్గిరినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల యుకె నుండి వచ్చిన సోదరుడి నుండి కరోనా సోకినట్లు మాధవి అనుమానం వ్యక్తం చేసింది. ముగ్గురినీ ఐసోలేషన్ లో ఉంచి వైద్యల పర్యావేక్షణలో చికిత్స అందిస్తున్నారు. అలాగే, నగరంలోని బార్కస్ లో ఓ కరోనా అనుమానితుడిని కూడా గాంధీకి తరలించారు. కాగా, ఇప్పటికే రాష్ట్రంలో 19 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.

Another 4 Corona Suspected cases in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News