హైదరాబాద్ ః నటి శ్రీరెడ్డి. ఆమెపై నటి కరాటే కల్యాణి ఫిర్యాదు చేయడం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కూడా బుధవారం శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు పెడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతుండడంతో భరించలేకపోయిన రాకేశ్ మాస్టర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలావుండగా నటి శ్రీరెడ్డిపై మంగళవారం నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ ఎసిపి కెవిఎం ప్రసాద్ కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఫెస్బుక్ లైవ్లో తనను అసభ్యకరంగా దూషించారని శ్రీరెడ్డిపై నటి కరాటే కల్యాణి ఫిర్యాదు చేసింది. కంటెంట్స్ ప్రకారంగా 67 ఐటి యాక్ట్తో పాటు 506, 509 ఐపిసి సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఈ తరహా కామెంట్స్ చేసినా సపోర్ట్ చేసినా చట్ట రిత్యా నేరమని, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.