Saturday, April 27, 2024

ఎపి టిడిపి కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు

- Advertisement -
- Advertisement -

AP TDP Atchannaidu As New President

అమరావతి: ఎపి తెలుగుదేశం పార్టీ కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఎంపికయ్యారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 27న రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే చంద్రబాబు ఇప్పటివకే టిడిపి రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై కసరత్తు పూర్తి చేశారు. ఈనెల 27న కమిటీ సభ్యుల జాబితాను ప్రకటించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం ఒక యూనిట్ గా ఇకపై టిడిపి జిల్లా కమిటీ ఉండనుండగా… 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 25 అధ్యక్షులను నియమించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతన్నాయి.

ఎపిలో మారిన పరిస్ధితుల్లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్‌ఐ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కళావెంకట్రావును అప్పట్లో సామాజిక సమీకరణాల దృష్ట్యా తెరపైకి తెచ్చారు. ఆయన గత ఎన్నికల్లో ఓటమి తర్వాత యాక్టివ్‌గా కనిపించడం లేదని పార్టీలో చర్చ సాగుతోంది. దీంతో అదే ప్రాంతానికి చెందిన అచ్చెన్నాయుడు పేరు అధ్యక్ష రేసులోకి వచ్చినట్టు తెలుస్తోంది.

AP TDP Atchannaidu As New President

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News