Monday, May 6, 2024

ప్రణయ్ కు పట్టిన గతే పడుతోందని…. ప్రేమజంటకు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

Bride relatives threaten to Lovers in guntur

 

అమరావతి: ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను యువతి తల్లిదండ్రులు బెదిరిస్తున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సౌమ్య, దిలీప్ అనే యువతి యువకుడు ప్రేమించుకొని రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి యువతి తల్లిదండ్రులు దిలీప్ చంపుతామని బెదిరిస్తున్నారు. తన కూతురును బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని అత్తమామలు అతడిపై కేసు పెట్టారు. తన కూతురును విడిచిపెట్టకపోతే ప్రణయ్ పట్టిన గతే తనకు పడుతుందని అత్తమామలు బెదిరిస్తున్నారని దిలీప్ స్థానిక ఎస్ పికి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News