Saturday, April 27, 2024

నడిరోడ్డుపై లారీ ఓనర్ డీజిల్ పోసుకొని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Lorry owner commit suicide with diesel at vizag

విశాఖపట్నం: నల్లగొండ జిల్లాకు చెందిన లారీ యజమాని ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఎలిమినేడు గ్రామానికి చెందని నర్సిరెడ్డికి లారీ ఉంది. మిర్యాలగూడ నుంచి లోడ్‌తో ఒడిశాకు వెళ్తుండగా నర్సిరెడ్డి గాజువాడ వచ్చాడు. శ్రీనగర్‌లో లారీని అక్కడే ఉంచి నర్సి రెడ్డి నిద్రపోయినప్పుడు డ్రైవర్ లారీని తీసుకెళ్లి ఇసుకను ఆన్‌లోడ్ చేసుకొని గాజువాకకు వచ్చాడు. డ్రైవర్లతో కలిసి నర్సిరెడ్డి భోజనం చేసి రాత్రి పడుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున నర్సిరెడ్డి నిద్రలేచి తన లారీలోకి వెళ్లి డీజిల్ క్యాన్ తీసుకొని రోడ్డు పైకి వచ్చాడు. ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి మంటలను ఆర్పేశారు. కానీ అప్పటికే అతడు చనిపోయాడు. మృతుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా అతడు తమ్ముడు కృష్ణా రెడ్డికి సమాచారం ఇచ్చారు. మానసిక సమస్యలతోనే నర్సిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News