Friday, May 10, 2024

తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: ఎపి కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజనాథ్

- Advertisement -
- Advertisement -

APCC Chief Sailajanath says Diwali wishes to people

విజయవాడ: రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని ఆయన ఆకాంక్షించారు. కోవిడ్ నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

APCC Chief Sailajanath says Diwali wishes to people

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News