Monday, April 29, 2024

సాయి ధరమ్‌ తేజ్‌ కాలర్ బోన్ విరిగింది.. 48 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతాం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన మెగా మేనల్లుడు హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు ప్రస్తుతం అపోలోలో చికిత్స అందిస్తున్నారు. సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్యంపై అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ”రోడ్డు ప్రమాదంలో సాయి ధరమ్ కాలర్ బోన్ విరిగింది. అది పెద్ద సమస్య కాదు. అంతర్గతంగా శరీరంలో మారెక్కడా గాయాలు లేవు. ఆయ‌న ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేద‌ు. వెంటిలేషన్‌పై చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. మరో 48 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతాం. యాక్సిడెంట్‌కు గురవడం వల్ల షాక్‌లో అపస్మారకస్థితిలోకి వెళ్లారు. అంతే తప్ప మరే ప్రమాదమూ లేదు” అని అపోలో వైద్యులు తెలిపారు.

కాగా, శుక్ర‌వారం రాత్రి 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో సాయి ధ‌ర‌మ్ తేజ్ కు రోడ్డు ప్ర‌మాదం జరిగింది. స్పోర్ట్స్ బైక్ పై ప్ర‌యాణిస్తున్న క్ర‌మంలో బైక్ స్కిడ్ అవ్వడంతో ఈ ప్ర‌మాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు 108 సాయంతో సాయి ధరమ్‌ తేజ్‌ను మెడికవర్‌ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి మెరుగైన వైద్య చికిత్స కోసం ప్రత్యేక అంబులెన్స్ లో అపోలో ఆస్పటల్ కు తరలించారు.

Apollo Doctors release health bulletin of Sai Dharam Tej

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News