Sunday, April 28, 2024

బిజెపి పార్లమెంట్ ప్రభరీలు నియామకం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ప్రభరీలు నియమించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి శనివారం జాబితాను వెల్లడించారు. పార్లమెంట్ ప్రభరీలుగా అల్జాపూర్ శ్రీనివాస్ (ఆదిలాబాద్), అంకాపురం విష్ణువర్ధన్ రెడ్డి, న్యాయవాది (పెద్దపల్లి), పెద్దోళ్ల గంగా రెడ్డి (కరీంనగర్), వెంకటరమణి (నిజామాబాద్),బద్దం మహిపాల్ రెడ్డి (జహీరాబాద్) , ఎం. జయశ్రీ (మెదక్), పి. పాపా రావు (మల్కాజిగిరి), దేవకీ వాసుదేవ్ రావు ( సికింద్రాబాద్ ), గోలి మధుసూధన్ రెడ్డి (హైదరాబాద్), పి. సుగుణాకర్ రావు ( చేవెళ్ల), వీరెల్లి చంద్రశేఖర్ ( మహబూబ్ నగర్ )ఎడ్ల అశోక్ రెడ్డి (నాగర్‌కర్నూల్ ), చాడ శ్రీనివాస రెడ్డి (నల్గొండ), అట్లూరి రామకృష్ణ (భువనగిరి యాదాద్రి), డాక్టర్ వి. మురళీధర్ గౌడ్ (వరంగల్ ), నూకల వెంకటనారాయణ రెడ్డి (మహబూబాబాద్ ), కడగంచి రమేష్ (ఖమ్మం)లను నియమించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News