Saturday, April 27, 2024

ప్రమాదవశాత్తు కాల్పులు.. ఆర్మీ జవాన్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రమాదవశాత్తు జరిగిన కాల్పుల్లో ఆర్మీ జవాన్ మృతి చెందాడు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. జమ్ముకశ్మీర్ లోని బందిపోరా జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. బందిపోరా ఆర్మీ క్యాంప్‌లో 14 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఒక జవాన్ పొరపాటున కాల్పులు జరపగా ఒక జవాన్ మరణించాడు. మరో జవాన్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుని వివరాలు పోలీస్‌లు వెల్లడించలేదు. కాల్పులు జరిపిన జవాన్‌ను అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News