- Advertisement -
అమరావతి: గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లిలో ఓ ప్రేమోన్మాది యువతి తల్లిపై కాల్పులు జరిపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆర్మీలో పని చేసిన బాలాజీ అనే వ్యక్తి రమాదేవీ కూతురిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. దీంతో కూతురు తిరస్కరించడంతో పాటు ఆమె కుటుంబ సభ్యులు అతడిని హెచ్చరించాడు. ఇది మనసులో పెట్టుకున్న బాలాజీ నాటు తుపాకీ తీసుకొని వాళ్ల ఇంటికి వెళ్లి రమాదేవీపై కాల్పులు జరిపాడు. రమాదేవీ కాల్పులు జరిపేటప్పుడు పక్కకు జరగడంతో కుడి చెవి మీదుగా బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ఘటనపై రమాదేవీ స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని బాలాజీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలాజీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడిని సహకరించిన ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
Army Man Shoot on girls Mother in Guntur District
Army Man Shoot on girls Mother in Guntur Dist
- Advertisement -