Saturday, April 27, 2024

అక్రమంగా ఉంటున్న విదేశియుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Arrest of a foreigner staying illegally in India
వీసా గడువు ముగిసిన నగరంలో మకాం

హైదరాబాద్: వీసా గడువు ముగిసినా ఇండియాలో అక్రమంగా ఉంటున్న విదేశియుడిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…సొమాలియా దేశానికి చెందిన అబ్దుల్లా అహ్మద్ అవేసి అలియాస్ జోర్డాన్ స్టూడెంట్ వీసాపై జనవరి1, 2017లో నగరానికి వచ్చాడు. అప్పటి నుంచి నగరంలోని రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లిలో ఉంటున్నాడు. వీసా గడువు ముగియడంతో దరఖాస్తు చేసుకోగా 4,సెప్టెంబర్, 2020 వరకు, పాస్‌పోర్టును అక్టోబర్ 25, 2020వరకు పొడిగించుకున్నాడు. దాని గడువు ముగిసినా కూడా నగరంలో ఉంటూ డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ రాజేష్, ఎస్సైలు మల్లిఖార్జున్, ఎండి ముజఫర్‌అలీ, రంజిత్‌కుమార్, సేక్ కవిఉద్దిన్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News