- Advertisement -
హైదరాబాద్: మద్యం మత్తులో క్యాబ్ డ్రైవర్ కెపిహెచ్బి ఎఎస్ఐ మహిపాల్ రెడ్డిని ఢీకొట్టడంతో అతడు చికిత్స పొందుతూ చనిపోయాడు. మార్చి 27న నిజాంపేట రోడ్డులోని ఎఎస్ఐ మహిపాల్ రెడ్డి తన సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాడు. మద్యం మత్తులో ఉన్న క్యాబ్ డ్రైవర్ ఎఎస్ఐతో పాటు హోంగార్డును ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహిపాల్ రెడ్డి బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. ఎఎస్ఐ నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -