Friday, May 3, 2024

ప్రజల విశ్వాసం ఎన్డీఏపైనే ఉంది: ప్రధాని

- Advertisement -
- Advertisement -

Assam People trust NDA for development Says Modi

బిజ్నీ: అస్సాం ప్రజలు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమికి మరోసారి రెడ్ కార్డు చూపారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తొలి విడత పోలింగ్ లోనే అస్సాం ప్రజలు ఎన్డీఏను ఆశీర్వదించారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పాలనలోని రాష్ట్రాల్లో హింస జరుగుతున్న ఆ పార్టీ నాయకులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మోడీ విమర్శించారు. అస్సాం రాష్ట్రం కోక్రాఝర్ పరిధిలోని బిజ్నీలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ పాల్గొని మాట్లాడారు. అస్సాం అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణకు ఎన్డీఏ కట్టుబడి ఉందని,  ఎన్డీఏపైనే ప్రజలు నమ్మకంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అత్యధిక మెజార్టీతో గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.

Assam People trust NDA for development Says Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News