Monday, April 29, 2024

దేవులపల్లి అమర్‌కు ‘ఆటా’ ఎక్సలెన్స్ అవార్డు

- Advertisement -
- Advertisement -

‘ATA’ Excellence Award for Devulapalli Amar

మనతెలంగాణ/ హైదరాబాద్: జర్నలిజం రంగంలో విశేష కృషి చేసినందుకు అమెరికా తెలుగు సంఘం దేవులపల్లి అమర్‌ను ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా ప్రముఖ జర్నలిస్టు దేవులపల్లి అమర్ పనిచేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో అమెరికా తెలుగు సంఘం (ఆటా) వేడుకలు నిర్వహించారు. అమెరికా తెలుగు సంఘం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 1990 సంవత్సరంలో స్థాపించారు. ఈ సంస్థ. తెలుగు భాష, సంస్కృతిని ప్రోత్సహిస్తూ, ప్రవాస భారతీయుల ప్రయోజనం కోసం అనేక సేవలందిస్తున్నారు. అవార్డును అందుకున్న అమర్ ‘ఆటా’ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర సాంస్కతిక, పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు, ఎంపి రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పద్మశ్రీ డాక్టర్ శోభరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News