Monday, April 29, 2024

ఆటోపై తెగిపడిన హైటెన్షన్ వైర్లు..10 మంది సజీవదహనం

- Advertisement -
- Advertisement -

Satya sai auto

సత్యసాయి జిల్లా: సత్యసాయి జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో కూలీలతో వెళ్తున్న ఆటో మంటల్లో కాలి బూడిదయ్యింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మృతులు గుడ్డంపల్లికి చెందిన కూలీలుగా గుర్తించారు.ఈ ఘటన తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో చోటు చేసుకుంది. వ్యవసాయ పనుల కోసం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

కొద్దిరోజులుగా అక్కడ విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆటోలో ఉన్న ఇనుప వస్తువు హై టెన్షన్ విద్యుత్ వైర్లకు తగలడంతో ప్రమాదం జరిగింది అంటున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ప్రమాదంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. శ్రీసత్యసాయి జిల్లా, తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో రోడ్డు ప్రమాదంలో పలువురు చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అన్నారు. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని.. మృతుల కుటుంబసబ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని.. హైటెన్సన్ విద్యుత్ తీగలు తెగి ఆటోపై పడడంతో ప్రమాదం జరిగిందని.. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News