Saturday, April 27, 2024

బిఆర్‌ఎస్‌పై బండి సంజయ్ మండిపాటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని కరీంనగర్ బిజెపి ఎంపి బండి సంజయ్ సవాల్ విసిరారు. గురువారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ… కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ‘అవిశ్వాసం ఎందుకు ప్రవేశపెట్టారో వారికే స్పష్టత లేదు. ప్రతిపక్ష పార్టీ నాయకుడి వ్యవహారం చూసిన తర్వాత ప్రపంచమంతా నవ్వుకుంటున్నారు. ముద్దులు పెడతారు.. ప్లైయింగ్ కిస్లు ఇస్తారు.. మరో సారి కౌగిలించుకుంటారు… ఒకసారి కన్ను కొడతారు. ఆయన వ్యవహార శైలి చూస్తే గజినీ గుర్తొస్తాడు. భరతమాతను హత్య చేశారంటున్నారు. భరతమాత వైపు కన్నెత్తి చూస్తే.. కళ్లు పీకి బొందపెట్టే ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వారే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రజలు సహించే స్థితిలో లేరు. ఏ కాంగీ, బెంగాల్ కా దీదీ, దిల్లీ కా కేజీ, బిహార్ కా జేడీ, తెలంగాణ కా కేడీ. వీళ్లతోని ఏమీ కాదు. ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం శక్తిమంతమైన భారత దేశ నిర్మాణం కోసం కృషి చేస్తోందన్నారు. నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన దేవాలయం ఈ పార్లమెంట్ అని కొనియాడారు. ఇదే వేదికగా స్వర్గీయ సుష్మాస్వరాజ్. తెలంగాణ యువకులారా ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. మీరు కోరుకున్న తెలంగాణను ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మీరు తెలంగాణ ఇస్తారా? లేదంటే మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాం అని కాంగ్రెస్‌ను హెచ్చరిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ బిల్లుపెడితే బిజెపి మద్దతుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.
ముఖ్యమంత్రి కుటుంబ ఆస్తులు పెరిగాయి.. రైతుల ఆదాయమేది?
అవినీతి యుపిఎ.. ఇండియాగా ఎలా మారిందో.. కుటుంబ పార్టీ అయిన టిఆర్‌ఎస్.. బిఆర్‌ఎస్‌గా మారిందని బండి సంజయ్ ఆరోపించారు. బిఆర్‌ఎస్ అంటే్ర భష్టాచార్ రాక్షస సమితి…కెసిఆర్ అంటే ఖాసిం చంద్రశేఖర్ రిజ్వీ అని విమర్శించారు. 24 గంటలు కరెంటు ఇస్తున్నామని ఎంపి నామా నాగేశ్వరరావు చెప్పారు. తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే… తాను రాజీనామా చేయడానికి సిద్ధమని వెల్లడించారు.

పిఎంఎవై పథకం కింద ఇంటి నిర్మాణం కోసం రూ.2.50లక్షల చొప్పున నరేంద్రమోడీ ప్రభుత్వం ఇస్తే.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేశారని దుయ్యబట్టారు. వివిధ కేంద్ర పథకాల నిధులను మళ్లించారని ఆరోపించారు. మణిపూర్ అల్లర్ల గురించి బిఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.. తెలంగాణాలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు.. భూ కబ్జాలపై ఎందుకు స్పందించడం లేదన్నారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్, ఎంఐఎం కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నయ్. గల్లీలో కుస్తీ పడుతున్నట్లు యాక్షన్ చేస్తూ ఢిల్లీలో దోస్తీ చేస్తూ మోడిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పని ఖతమైంది… కాంగ్రెస్ గల్లీలో లేదు… ఢిల్లీలో లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News