Friday, May 17, 2024

బిసి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు…

- Advertisement -
- Advertisement -

కాస్మెటిక్, బెడ్డింగ్ మెటీరియల్, ఉలన్ బ్లాంకెట్స్, నోట్ బుక్స్
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
34వేల మంది బిసి విద్యార్థులకు లబ్ది
బిసి వర్గాల విద్యా ప్రదాత సిఎం కెసిఆర్
మంత్రి గంగుల కమలాకర్ కృతజ్ఞతలు

హైదరాబాద్ : వెనక్కు నెట్టేయబడ్డ వర్గాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యను అందించి వారి సామాజిక, ఆర్థిక జీవన స్థితిగతులను మెరుగపర్చడానికి విశేష కృషి చేస్తూ బిసి వర్గాల విద్యాప్రధాతగా మారారని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గురువారం బిసి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు కాస్మెటిక్, బెడ్డింగ్ మెటీరియల్, ఉలన్ బ్లాంకెట్స్, నోట్ బుక్స్ అందజేసే ఉత్తర్వులను జారీ చేసినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రంలోని 302 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో చదువుకునే కాలేజీ విద్యార్థులకు నాణ్యమైన బోజన, వసతులతో పాటు అధనంగా ఎస్‌సి, ఎస్‌టి ప్రీమెట్రిక్ హాస్టల్ విద్యార్థుల మాదిరి సౌకర్యాలు అందుతాయన్నారు. ఏటా 12 కోట్లను అధనంగా కేటియించడం ద్వారా దాదాపు 34వేల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారని మంత్రి తెలిపారు. 19 బిసి గురుకులాలను 327కు పెంచడం, మహాత్మా జ్యోతీబా పూలే పేరున ఒక్కో విద్యార్థికి 20 లక్షల విదేశీ విద్యానిది, రాష్ట్రంలోని విద్యార్థులకు పీజు రియింబర్స్‌మెంట్ అందజేస్తున్నామన్నారు, ఈ సంవత్సరం నుంచి దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ వంటి విద్యాసంస్థల్లో చదివే బిసి వర్గాల బిడ్డలకు సైతం ఫీజులను చెల్లించబోతున్నామన్నారు. చరిత్రలో మొదటి సారిగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బిసి విద్యార్థుల చదువుకు ఊతమిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని కొనియాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు యావత్ బిసి సమాజం పక్షాన ప్రత్యేక కృతజ్ణతలు తెలియజేసారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News