మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజలు కరోనా(కోవిద్19)పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా లేకుంటే పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయని, ఏపరిస్థితుల్లోనైనా వ్యాపిస్తుందని రాజ్యసభసభ్యుడు, కేంద్ర ప్రభుత్వ రంగసంస్థల కమిటీ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ హెచ్చరించారు. ప్రజలు స్వీయ నియంత్రణతో పాటు ఖచ్చితంగా ఆరోగ్యసూత్రాలు పాటించాలని ఆయన ట్విట్టర్లో పిలుపునిచ్చారు. ఈ ఘోరమైన మహమ్మారితో పోరాడటానికి ఏకైకమార్గం లాక్డౌన్తో పాటు ప్రజలు సామాజిక దూరం, స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజలు ఇళ్లలోనే ఉంటూ ఆరోగ్య సూత్రాలు పాటించాలని పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు జనతాతర్ఫూను ప్రజలు అసాధారణరీతిలో అమలు చేసి చరిత్ర సృష్టించినట్లే లాక్డౌన్ పాటించి కరోనాను తరిమివేయాలని ఆయన చెప్పారు.భారతీయులు సంఘటితంగా ఉంటే దేనినైనా జయించవచ్చనే సంకేతాలను జనతాకర్పూ విజయవంతంతో ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. కోవిద్ 19 కరోనాశక్తిని అర్థ్థం చేసుకుని ప్రజలు మరింత అప్రమత్తంగా లేకుంటే వ్యాపిస్తుందని ఆందోళనవ్యక్తం చేశారు. ఘోరమైన ఈ మహమ్మారితో పోరాడటానికి లాక్డౌన్ సరైన మార్గమన్నారు.