- Advertisement -
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ 71వజన్మదినం ఈ నెల 17న జరగనున్న సందర్భంగా 20 రోజుల భారీ కార్యక్రమాన్ని చేపడుతారు. సేవా సమర్ఫణ్ అభియాన్ పేరిట 5 కోట్ల పోస్టుకార్డులు పంపిస్తారని బిజెపి వర్గాలు శనివారం తెలిపాయి. ప్రధాని మోడీ 20 ఏళ్ల ప్రజా సేవ, ప్రజాజీవితాన్ని తెలిపే హోర్డింగ్లు ఆయనకు బిజెపి తరఫున ధన్యవాదాలు తెలుపుతారు. ప్రధాని జన్మదినం సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో దేశంలో స్వచ్ఛతా కార్యక్రమాలు, రక్తదానాలు ఇతరత్రా పలు కార్యక్రమాలను 20 రోజుల పాటు చేపడుతారు. ఈ మేరకు బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా అన్ని రాష్ట్రాల బిజెపి విభాగాలకు ఆదేశాలు వెలువరించారు.
- Advertisement -