లక్నో: ఓ మహిళ తనపై బిజెపి ఎంఎల్ఎ, అతడి ఐదుగురు కుమారులు అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని భదోహి ప్రాంతం కోవ్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బిజెపి ఎంఎల్ఎతో పాటు అతడి ఐదుగురు కుమారులు, మేనల్లుడుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. 2007లో సదరు మహిళ భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా ఉంటుంది. ముంబయి నుంచి వారణాసి వస్తుండగా రైళ్లో సందీప్ పరిచయం అయ్యాడని ఆమె చెప్పుకొచ్చింది. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై సందీప్ అత్యాచారం చేశాడని ఆమె పేర్కొంది. పలుమార్లు హోటళ్లలో బిజెపి ఎంఎల్ఎ రవీంద్ర నాథ్ త్రిపాతి, ఆయన కుమారులు ఐదుగురు, మేనల్లుడు గత ఆరు సంవత్సరాల నుంచి ఆమెపై అత్యాచారం చేశారని వెల్లడించింది. 2017లో ఎన్నికల సందర్భంగా బిజెపి ఎంఎల్ఎ రవీంద్ర నాథ్ త్రిపాతి కూడా అత్యాచారం చేశాడని ఫిబ్రవరి తొమ్మిదిన భదోహి పోలీస్ స్టేషన్లో వారిపై ఆమె ఫిర్యాదు చేసింది. ఎంఎల్ఎ, అతడి తనయులు సచిన్, చంద్రభూషణ్, దీపక్, ప్రకాశ్, నితేష్, మేనల్లుడు సందీప్పై గ్యాంగ్ రేప్(376డి), చంపేస్తామని బెదిరింపులు(506), క్రూరంగా హింసించటం(504) పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని స్థానిక ఎస్పి రామ్ బదన్ సింగ్ తెలిపాడు. భదోహి నియోజకవర్గం నుంచి రవీంద్రనాథ్ బిజెపి తరఫున గెలుపొందాడు.