Monday, April 29, 2024

భండారా ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు..ఉద్యోగి దుర్మరణం

- Advertisement -
- Advertisement -

భండారా : మహారాష్ట్రలోని భండారా ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం సంభవించిన పేలుడులో ఒక ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడని, ప్రమాదానికి కారణం నిర్ధారణకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారని అధికారులు తెలియజేశారు. భండారా నగరం శివార్లలోని జవహర్‌నగర్‌లో గల ఫ్యాక్టరీలో ఈ విస్ఫోటం సంభవించింది. మృతుని 52 సంవత్సరాల అవినాశ్ మెష్రామ్‌గా గుర్తించారు. పేలుడు సంభవించినప్పుడు మెష్రామ్ విధి నిర్వహణలో ఉన్నారు. ఫ్యాక్టరీ ఆసుపత్రికి వెంటనే తరలించేందుకు ప్రయత్నించినా ఆసుపత్రికి తరలించేసరికే మెష్రామ్ మరణించినట్లు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు అస్పష్టంగా ఉన్నందున పేలుడు కారణం నిర్ధారణకు ముగ్గురు సభ్యుల దర్యాప్తు కమిటీని ఫ్యాక్టరీ అధికారులు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News