ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముంబైలో తాజాగా మరో 2,749 మందికి కరోనా వైరస్ సోకింది. కోవిడ్-19 కేసులు గుర్తించిన బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు 1,305 భవనాలను సీల్ వేశారు. మూసివేసిన భవనాల్లో మొత్తం 71,838 మంది ప్రజలు నివాసం ఉంటున్నట్టు బిఎంసి అధికారులు వెల్లడించారు. కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి రోజు 15 వేలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆర్థిక రాజధాని ముంబైలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,17,310కు చేరింది. ఇప్పటివరకు 11,435 మంది కరోనాతో మృతి చెందారు.
A total of 1305 buildings sealed in Mumbai after 2749 #COVID19 cases reported. 71,838 households residing in these sealed buildings: Brihanmumbai Municipal Corporation (BMC) pic.twitter.com/RTaoWhhPK8
— ANI (@ANI) February 20, 2021
BMC seals 1305 buildings after Covid surge