Saturday, April 27, 2024

ప్రముఖ దర్శక నిర్మాత మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయి: బాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రముఖ సినీ దర్శక నిర్మాత రాజ్ కుమార్ కోహ్లీ (93) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యుల పేర్కొన్నారు. రాజ్‌కుమార్ మృతిపట్ల సోషల్ మీడియాలో కుటుంబ సభ్యులు సంతాపం తెలిపారు. ఇవాళ సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. జీనే నహీ దూంగా, రాజ్ తిలక్, కహానీ హబ్ సభ్ కీ, నాగిన్, జానీ దుష్మన్, పతి పత్నీ ఔటర్ తవైఫ్, తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. గౌరా ఔర్ కాలా, డంకా, లూటేరా వంటి హిందీ చిత్రాలతో పాటు దుల్లా భట్టి, మెయిన్ జట్టి పంజాబ్ ది, పిండ్ డి కుర్హి వంటి పంజాబీ చిత్రాలకు నిర్మాత వ్యవహరించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News