Saturday, April 27, 2024

చిరుత దాడిలో బాలుడి మృతి…

- Advertisement -
- Advertisement -

Boy dead with Leopard attack at UP

 

లక్నో: చిరుతపులి దాడిలో 14 ఏళ్ల బాలుడు చనిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఖేరీ అటవీ ప్రాంతంలో జరిగింది. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… చందన్ అనే బాలుడు సహబ్దిన్ గ్రామ శివారులో పశువుల మేత కోసం బావి దగ్గరకు వెళ్తుండగా చిరుత అతడిపై దాడి చేసింది. బాలుడు అరుపులు విని రైతులు అక్కడికి చేరుకునేసరికి బాలుడు రక్తపు మడుగులో కనిపించాడు. గాఘ్రా నది సమీపంలో చిరుతపులి కనిపించిందని గ్రామస్థులు తెలిపారు. ఆ చిరుతే దాడి చేసి ఉంటుందని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నెల 14వ తేదీన కూడా బ్రిజేష్ ప్రాంతంలో చిరుత పులి దాడిలో బాలుడు చనిపోయాడు. పులులు, చిరుతల దాడులతో అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండే గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. పొలాలకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News