Saturday, April 27, 2024

భవనంపై నుంచి పడి బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ప్రమాదవశాత్తు నాలుగవ అంతస్తు నుంచి పడి బాలుడు మృతిచెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..శ్రీనగర్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గ్ పనిచేస్తున్న వ్యక్తి కుమారుడు దివ్యాంగుడు. తల్లిదండ్రులు చూడకముందు అపార్ట్‌మెంట్ నాలుగవ అంతస్తులోకి వెళ్లాడు. అక్కడి నుంచి ప్రమాదవశాత్తు కింద పడడంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News