Tuesday, April 30, 2024

కరోనా వైరస్… వరుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

చెన్నై: కరోనా వైరస్ సోకడంతో వరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని తండయార్ పేటలో జరిగింది. బివి కాలనీకి చెందిన కార్తీక్ మూడు నెలల క్రితం యువతిని పెళ్లి చేసుకున్నాడు. కార్తీక్ ను తీవ్రమైన జ్వరంతో పాటు దగ్గు, జలుబు ఉండడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాడు. కరోనా పాజిటివ్ రావడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. కార్తీక్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు భార్యకు కరోనా సోకే అవకాశం ఉందని భయానికి గురయ్యాడు. ఫోన్ లో తన బంధువులకు తెలియజేస్తూ బాధపడేవాడు. మంగళవారం సాయంత్ర వార్డు గదిలో కార్తీక్ ఉరేసుకొని చనిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News