Thursday, May 9, 2024

లోక్‌సభలో బిఆర్‌ఎస్ అవిశ్వాస తీర్మానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : లోక్ సభలో భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఎన్‌డిఎ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిందని, ఆ మేరకు బిఆర్‌ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వర రావు నోటీసులు ఇచ్చారు. ఆ అవిశ్వాస తీర్మానాన్ని బిజినెస్ లిస్టులో చేర్చాలని కోరారు. లోక్‌సభలో రూల్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్‌లోని 17వ అధ్యాయంలోని రూల్ 198 (బి) కింద, ఈ క్రింది తీర్మానాన్ని సభలోకి తీసుకురావాలని బిఆర్‌ఎస్ నోటీసు ఇచ్చింది.

బుధవారం సవరించిన బిజినెస్ లిస్ట్ లో తీర్మానాన్ని చేర్చవలసిందిగా ఆ పార్టీ కోరింది. దీనికి ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లమీన్ (ఎఐఎంఐఎం) పార్టీ మద్దతు ఇచ్చింది. ఈ మేరకు బిఆర్‌ఎస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ప్రతిపై ఎఐఎంఐఎం అధినేత, లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సంతకం చేశారు.మణిపూర్ అంశంపై కేంద్ర విధానాలు సరిగా లేవని బిఆర్‌ఎస్ పార్టీ ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News