Sunday, April 28, 2024

కశ్మీరులో పాక్ డ్రోన్ విడిచిన ఆయుధాలు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

BSF recovers AK-47 rifle, pistol dropped by Pakistani drone in Jammu

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉన్న జమ్మూ కశ్మీరులోని సంబా జిల్లాలో ఒక పాకిస్తానీ డ్రోన్ జారవిడిచిన ఒక ఎకె 47 రైఫిల్, ఒక పిస్టల్, కొంత మందుగుండు సామగ్రిని బిఎస్‌ఎఫ్ సిబ్బంది శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఒక పసుపు రంగు పాలిథిన్ సంచిలో చుట్టి ఉంచిన ఈ ఆయుధాలు, మందుగుండును నేల మీద పడి ఉండగా బిఎస్‌ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాలలో ఒక ఎకె 47 రైఫిల్, ఒక 9ఎంఎం పిస్టల్, ఒక పిస్టల్ మేగజైన్, 15 బుల్లెట్ రౌండ్లు, ఈ ఆయుధాల సంచిని డ్రోన్ కింది భాగంలో ఉంచేందుకు ఉపయోగించిన ఒక చెక్క పలక ఉన్నాయని వారు చెప్పారు. ఈ ఆయుధాలను జారవిడిచిన అనంతరం ఆ డ్రోన్ తిరిగి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News