Sunday, April 28, 2024

పెట్రోల్ ధరలు పైపైకి..

- Advertisement -
- Advertisement -

Petrol and diesel prices touches record highs on Friday

వారంలో నాలుగో సారి పెంపు

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ వారంలో వరుసగా నాలుగవరోజు ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 28 పైపలు, డీజిల్‌పై 34 పైసలు పెంచినట్లు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు శుక్రవారం ప్రకటించాయి. దేశ రాజధాని ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేని విధంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 92.34కు చేరుకోగా డీజిల్ ధర రూ. 82.95కి పెరిగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని అనేక నగరాలలో ఇప్పటికే పెట్రోల్ ధరలు సెంచరీ దాటేశాయి. తాజా పెరుగుదలతో ముంబయి నగరంలో కూడా పెట్రోల్ ధర సెంచరీకి చేరువలో ఉంది. లీటర్ పెట్రల్ ధర ముంబయిలో రూ. 98.65కి చేరుకోగా డీజిల్ ధర రూ. 90.11కి పెరిగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News