Sunday, April 28, 2024

ఐదుగురు చొరబాటుదారులు కాల్చివేత

- Advertisement -
- Advertisement -

BSF shoots down 5 intruders at India Pakistan border

పంజాబ్: భార‌త్ చేతిలో పాకిస్థాన్ ఎన్ని ఎదురు దెబ్బ‌లు తిన్నా తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. ‌త‌న‌వైపు నుంచి భార‌త్‌లోకి ఉగ్ర‌వాదుల చొర‌బాట్ల‌ను ప్రోత్స‌హిస్తూనే ఉంది. భార‌త్‌-పాకిస్థాన్ స‌రిహ‌ద్దు గుండా ఐదుగురు ఉగ్ర‌వాదులు దేశంలోకి ప్ర‌వేశించారు. శ‌నివారం తెల్ల‌వారుజామున 4:45 గంట‌ల‌కు పంజాబ్‌లోని తార్న్ తార‌న్ జిల్లా ఖెమ్‌క‌ర‌న్ బార్డ‌ర్ ఏరియాలో గ‌స్తీ నిర్వ‌హిస్తున్న భ‌ద్ర‌తా ద‌ళాల‌కు ఐదుగురు చొర‌బాటుదారులు ఎదురుపడ్డారు. ఉగ్ర‌వాదుల‌ను లొంగిపోవాలంటూ భ‌ద్ర‌తాబ‌ల‌గాలు హెచ్చ‌రించాయి. జ‌వాన్లు ఆదేశాల‌ను ప‌ట్టించుకోకుండా ఉగ్ర‌వాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భ‌ద్ర‌తా ద‌ళాలు కూడా ఎదురు కాల్పులు జరిపి ఐదుగురు చొర‌బాటుదారులను స‌రిహ‌ద్దుల్లోనే హ‌త‌మార్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News