- Advertisement -
న్యూఢిల్లీ: సిఎ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించడం సాధ్యం కాదని ఐసిఎఐ స్పష్టం చేసింది. మూడు గంటలపాటు జరిగే సిఎ పరీక్షల్లో వివరణాత్మక సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని, టిక్కులు పెట్టి సమాధానాలిచ్చే పద్ధతిలో నిర్వహించలేమని తెలిపింది. ఆన్లైన్లో నిర్వహించాలంటూ వచ్చిన పిటిషన్లపై జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఐసిఎఐ తరఫున సీనియర్ న్యాయవాది రాంజీ శ్రీనివాసన్ వివరణ ఇచ్చారు. పరీక్షకు హాజరయ్యేవారి విశ్లేషణా సామర్థాన్ని అంచనా వేసేలా ప్రశ్నా పత్రాలుంటాయని ఆయన సుప్రీంకోర్టుకు తెలిపారు. నవంబర్ 21నుంచి డిసెంబర్ 14 వరకు సిఎ పరీక్షలు జరగనున్నాయి.
CA exams cannot be conducted online says ICAI
- Advertisement -