Saturday, April 27, 2024

ప్రగతి నగర్‌లో కారు భీభత్సం..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః కారు భీభత్సం సృష్టించి పలు వాహనాలను ధ్వంసం చేసిన సంఘటన కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ప్రగతినగర్ నుంచి ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉన్న కారులో ఇద్దరు యువకులు వస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న కార్లను ఢీకొట్టారు. దీంతో పలువురి కార్లు ధ్వంసం అయ్యాయి. స్థానికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా కారుతో పాటు అక్కడి నుంచి పరారయ్యారు. వారిని వెంబడించిన స్థానికులు ఎల్లమ్మబండ వద్ద ఛేదించి పట్టుకున్నారు. ఇద్దరు యువకులు మత్తులో ఉన్నట్లు గమనించిన వారు వారిపై దాడి చేసి, కారును ధ్వంసం చేశారు. వారి దాడిలో స్పృహకోల్పోన ఇద్దరు యువకులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News