- Advertisement -
మనతెలంగాణ, హైదరాబాద్ : మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు నాగేంద్రబాబుపై ఓయూ పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదు చేశారు. మహ్మాత్మాగాంధీని నాగబాబు అవమానించారని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మానవతారాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహాత్మా గాంధీ శాంతికి నిదర్మనమని తెలిపారు. ట్విట్టర్లో నాథూరామ్ను పొగుడుతూ గాంధీని అవమానించడం దేశాన్ని కించపర్చడమేనని అన్నారు. వెంటనే నాగబాబు ట్విట్టర్ ఖాతాను బ్యాన్ చేయాలని, దర్యాప్తు చేసి కేసు నమోదు చేయాలని కోరారు.
- Advertisement -