Sunday, April 28, 2024

పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం: నిహారిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చైతన్య, తాను పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని నటుడు నాగబాబు కూతురు నిహారిక తెలిపారు. సున్నితమైన విషయంలో తనని ఇబ్బంది పెట్టొద్దని అంటూ ఇన్‌స్టాలో నిహారిక పోస్ట్ చేశారు. కొత్తగా ప్రారంభించే జీవితంలో ప్రైవసీ కోరుకుంటున్నామన్నారు. అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అండగా ఉన్న కుటుంబానికి మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.  ఇక నిహారిక, చైతన్య జొన్నలగడ్డ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. కాగా 2020 డిసెంబర్‌లో గుంటూరు ఐజి జె.ప్రభాకర్ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరిగిన విషయం తెలిసిందే.

Also Read: గిరిజనుడిపై మూత్ర విసర్జన.. బిజెపి నేత అరెస్ట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News