Sunday, May 5, 2024

తిరుపతిలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుపతిలో టిడిపిపై నటుడు, జనసేన నేత నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టిడిపి నాయకులు మన కిందనే పని చేయాలని, టిడిపితో కలిసి పని చేసినా జనసేన అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అధికారంలోకి వస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిఎం అంటూ నాగబాబు వ్యాఖ్యానించినట్టు సమాచారం. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జైలు పాలు కావడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎపి రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టిడిపి-జనసేన కూటమికి అధినాయకత్వం వహించే అవకాశాలు పవన్ కు ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News