Wednesday, May 29, 2024

జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ అధ్యక్షుడిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

Case registered against Jubileehills Cooperative President

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ కోపరేటివ్ అధ్యక్షుడు , టివి5 ఎండి రవీంద్ర నాయుడు పై ఆదివారం నాడు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈక్రమంలో జూబ్లీహిల్స్ కోపరేటివ్ సభ్యుడు సురేష్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. సర్వసభ్య సమావేశం నిర్వహించకుండానే గుట్టుచప్పుడు కాకుండా 355 గజాల స్థలాన్ని పార్వతి దేవి అనే మహిళకు అమ్మేశారని సురేష్ బాబు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాదాపు ఏడు కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని కోటి 65 లక్షల రూపాయలకు విక్రయించారని తెలిపారు.

జిహెచ్‌ఎంసి కి సంబంధించిన పార్కు స్థలాన్ని సొసైటీ స్థలంగా చూపెట్టి అమ్మకాలు జరపారని, కోట్లాది రూపాయల స్థలాన్ని గజం 45 వేలకుపార్వతి దేవికి విక్రయించారని, దీని వల్ల సొసైటీకి రూ.5 కోట్ల మేర నష్టం జరిగిందని సురేష్ బాబు అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు జూబ్లీహిల్స్ సొసైటీ అధ్యక్షుడు రవీంద్ర నాయుడు తో పాటు కోశాధికారి నాగరాజు పై కేసు నమోదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇక్కడే ఇంకొక వివాదంతెరపైకి వచ్చింది తమ స్థలం కబ్జాకు గురైదంటు జిహెచ్‌ఎంసి అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. సదరు స్థలం జిహెచ్‌ఎంసి కి సంబంధించిందని అందులో నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఇదిలావుండగా రవీంద్రనాధ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి 3 నెలలైనా కాకముందే అక్రమాలకు తెరలేపారని పలువురు చర్చించుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News